భారతదేశం, జూన్ 12 -- 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతగా భావిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామినీడులో '2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం' పేరిట భారీ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టడమే కాకుండా, ప్రజల్లో...