భారతదేశం, జూలై 27 -- ఆధ్యాత్మికంగా, ధార్మికంగా హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి ఎంతో విశేష ప్రాధాన్యం ఉంది. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన పర్వదినం కాబట్టే దీనిని 'వ్యాస పౌర్ణమి' అని కూడా పిలుస్తుంటారు. ప్రతి ఏడాదీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున శ్రీహరి, లక్ష్మీదేవి, చంద్ర భగవానుడితో పాటు మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం.

హిందూ పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది జులై 29వ తేదీ, బుధవారం నాడు గురు పౌర్ణమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి, ఉపవాసం ఉండి, దానధర్మాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

లక్ష్మీ నారాయణులను గురు పౌర్ణమి నాడు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ...