భారతదేశం, జూలై 22 -- హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని శుభత్వానికి, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. సకల సంపదలు, వైభవం, అదృష్టం, సామాజిక హోదాకు కారకుడైన బృహస్పతి ఎప్పటికప్పుడు తన గమనాన్ని మారుస్తుంటాడు.

ప్రస్తుతం పుష్యమి నక్షత్రంలో సంచరిస్తున్న గురు భగవానుడు, రాబోయే ఆగస్టు 19న బుధ గ్రహానికి చెందిన అశ్లేషా నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నారు. అక్టోబర్ 31 వరకు ఆయన ఇదే నక్షత్రంలో సంచరిస్తారు.

జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, బుధుడు గురుడిని తటస్థంగా చూసినప్పటికీ, గురుని దృష్టిలో బుధుడు శత్రువుగా పరిగణిస్తారు. ఇలా బుధుడి నక్షత్రంలోకి గురుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురుకావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మూడు రాశుల వారు ఈ కాలంలో తీవ్రమైన మానసిక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలున్నాయి. ఆ రాశులు ఏంటో, ఎ...