భారతదేశం, మార్చి 14 -- న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ సరఫరాపై నెలకొన్న ఆందోళనలకు తెరపడింది. భారత్‌కు చెందిన రెండు భారీ ఎల్పీజీ (LPG) నౌకలు 'శివాలిక్', 'నందాదేవి' శనివారం ఉదయం హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

కేంద్ర నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండు నౌకలు సుమారు 92,700 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్‌ను మోసుకొస్తున్నాయి.

ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మరో 22 భారతీయ నౌకలు ఉన్నాయని, అందులోని 611 మంది భారతీయ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.

దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు అనవసరంగా కంగారు పడి (Panic Book...