భారతదేశం, జూన్ 10 -- భారత డిజిటల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta) కలిసి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అత్యాధునిక ఏఐ (AI) ఎనేబుల్డ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ముంబై వేదికగా బుధవారం (10 జూన్ 2026) రిలయన్స్ ఈ చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఈ భారీ డేటా సెంటర్ 168 మెగావాట్ల (MW) సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. రాబోయే రెండేళ్ల కాలపరిమితిలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా దీని సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వీలుంది. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మెటా అవసరాల కోసం భారతదేశంలో ప్రత్యేకంగా (Built-to-suit) నిర్మిస్తున్న మొదటి డేటా సెంటర్ ఇదే కావడం విశేషం...