భారతదేశం, జూలై 18 -- ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై ఒక మహిళను వివస్త్రను చేసి, విచక్షణారహితంగా దాడి చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాజం తలదించుకునేలా సాగిన ఈ అనాగరిక చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి ఆక్రందనలు విన్నా చూస్తూ ఉండిపోయారు కొందరు వ్యక్తులు.

జులై 15వ తేదీన రాత్రి కృష్ణబాబుకాలనీకి చెందిన మహిళ తన ఇంటి ముందర కుళాయి నుంచి మోటారు ద్వారా నీళ్లు పట్టుకుంటుంది. ఈ క్రమంలో మోటార్ తొలగించాలని చెబుతూ.. 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి వెంకటరమణమూర్తి, అతడి కుటుంబ సభ్యులు ఆమెతో గొడవకు దిగారు. తీవ్రంగా దాడి చేశారు. బాధితురాలు వెళ్తుంటే.. వెంటపడి మరి కొట్టారు. వెంకటరమణమూర్తి సోదరి, ట్రాన్స్‌జెండర్ మాధవి కొట్టారు.

బాధితురాలి వెంటపడి దుస్తులు చి...