భారతదేశం, ఫిబ్రవరి 8 -- చైనాపై అమెరికా తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. రష్యా- అమెరికా మధ్య జరిగిన అణు ఆయుధాల నియంత్రణ ఒప్పందం 'న్యూ స్టార్ట్' ముగిసిన తర్వాత.. 2020 జూన్ 22న చైనా రహస్యంగా అణు పరీక్ష నిర్వహించిందని అగ్రరాజ్యం తెలిపింది. అమెరికా చెబుతున్న ఈ తేదీ.. చైనాతో ఘర్షణలో లద్ధాఖ్‌లోని గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన తేదీకి అతి సమీపంలో ఉండటం గమనార్హం.

గల్వాన్ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించగా, చైనా వైపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. కానీ బీజింగ్ మాత్రం కేవలం నలుగురు సైనికుల మరణాన్ని మాత్రమే అధికారికంగా అంగీకరించింది.

కాగా, జెనీవాలో తాజాగా జరిగిన నిరాయుధీకరణ సదస్సులో అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో మాట్లాడుతూ.. "చైనా అణు పేలుడు పరీక్షలు నిర్వహించిందని, వందల టన్నుల సామర్...