భారతదేశం, జూలై 2 -- జీవితంలో ప్రశాంతత, పురోగతి ఉండాలంటే మనం ఎవరితో సమయం గడుపుతున్నామనేది కీలకం. దుష్ట సహవాసం మనిషి ఆలోచనా దృక్పథాన్ని నెమ్మదిగా మారుస్తుంది. అది వ్యక్తిగత నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గరుడ పురాణంలో పేర్కొన్న కొన్ని రకాల వ్యక్తులు మన జీవితంలోకి వస్తే అశాంతి, ఒత్తిడి తప్పవని హెచ్చరించారు. అటువంటి వారిని గుర్తించి, వారితో సాధ్యమైనంత వరకు దూరం పాటించడమే శ్రేయస్కరం.

కొంతమందికి ఎక్కడ ఉన్నా పక్కవారిని విమర్శించడమే పని. ఇతరుల వ్యక్తిగత విషయాలను, రహస్యాలను బయటపెట్టడం వీరి నైజం. మీ ముందు పక్కవారిని విమర్శించే వ్యక్తి, మీరు వెళ్లిన తర్వాత మీ గురించి వేరే వారి దగ్గర ఇలాగే మాట్లాడతారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇలాంటి వ్యక్తులు బంధాల విశ్వసనీయతను దెబ్బతీస్తారు.

అవసరానికి మాత్రమే గుర్తుకొచ్చే వ్యక్తులు మన జీవితంలో చాలా మంది ఉంటార...