భారతదేశం, సెప్టెంబర్ 12 -- పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం. అయితే, మరణం తర్వాత ఈ సృష్టిలో మనిషి ఆత్మకు ఏం జరుగుతుంది? అనే ప్రశ్న మానవజాతి పుట్టినప్పటి నుంచి వేధిస్తూనే ఉంది. హిందూ సనాతన ధర్మంలో మరణం అనేది అంతం కాదు, కేవలం ఆత్మ చేసే మరో కొత్త ప్రయాణానికి తొలి అడుగు మాత్రమే. ఈ అంశంపై మన ప్రాచీన గ్రంథమైన గరుడ పురాణంలో అత్యంత స్పష్టంగా, వివరంగా ప్రస్తావించారు. మృత్యువు, ఆత్మ ప్రయాణం, కర్మ సిద్ధాంతం, యమలోక మార్గం వంటి అనేక రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి.

హిందూ సంప్రదాయాల ప్రకారం కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, వారి ఆత్మశాంతి కోసం అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంత్యక్రియల నుంచి మొదలుకొని తర్పణాలు, పిండ ప్రధానం వరకు ప్రతీ ఆచారానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉంటుంది. శరీరం నశించినప్పటికీ, ఆత్మ తన పాత బంధాలు, కుటుంబంపై ఉన్న మొహంత...