భారతదేశం, సెప్టెంబర్ 3 -- రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము లేకుండా అనుమతులు జారీ చేసేందుకు సింగిల్‌ విండో విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ప్రారంభించినట్లు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.ప్రక్రియను సులభతరం చేయడం, ఏకరీతి ప్రమాణాలను కొనసాగించడం, వివిధ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం, పండుగను శాంతియుతంగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీజీపీ ఒక ప్రకటనలో వెల్లండిచారు.

గణేష్ ఉత్సవ్ కమిటీలు, మండపాల నిర్వాహకులు www.ganeshutsav.netకు లాగిన్ చేసి, ప్రతిపాదిత మండపం, ప్రదేశానికి సంబంధించిన అవసరమైన వివరాలను సమర్పించవచ్చు. అప్లికేషన్ పరిశీలన, జాయింట్ వెరిఫికేషన్ కోసం పోలీసు, అగ్నిమాపక, మున్సిపాలిటీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులకు పంపిస్తారు. పరిశీలన పూర్తయిన తర్వాత, QR- కోడ్ ఆధారిత డిజిటల్ నో అబ్జెక్షన్ సర్టిఫిక...