భారతదేశం, ఏప్రిల్ 21 -- Ganga Saptami 2026: భారతీయుల ఆరాధ్య దైవం, పాప ప్రక్షాళని గంగా మాత. హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ మాసం శుక్ల పక్ష సప్తమి తిథి (ఈ ఏడాది ఏప్రిల్ 23) నాడు గంగాదేవి పరమశివుని జటల నుంచి భూమి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందుకే ఈ రోజును 'గంగా సప్తమి' లేదా 'గంగా జయంతి'గా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ తర్వాత జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు గంగమ్మ భూమిని పూర్తిగా తాకింది, ఆ రోజును మనం 'గంగా దశహరా'గా పిలుచుకుంటాం. గంగా సప్తమి నాడు గంగా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని కోట్లాది మంది భారతీయుల నమ్మకం.

పురాణాల ప్రకారం గంగాదేవి శివుడి జటల నుంచి భూమికి దిగివచ్చే సమయంలో ఆమె వేగం అత్యంత భయంకరంగా వుంది. ఆ ప్రవాహ వేగానికి భూమిపై ఉన్న సర్వస్వం అల్లకల్లోలమయ్యింది. ఈ క్రమంలో గంగమ్మ ప్రవాహం 'జహ్ను' మహర్షి ఆశ్రమాన్ని...