భారతదేశం, మార్చి 27 -- పాఠాలు చెప్పి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక ప్రొఫెసర్.. క్లాస్‌రూమ్‌లోనే హద్దులు మీరి ప్రవర్తించిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. మెడికల్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినికి అందరి ముందే 'ప్రపోజ్' చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బెంగళూరు శివార్లలోని నేలమంగళ తాలూకాలో ఉన్న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మార్చి 23న ఈ అవాంఛనీయ ఘటన జరిగింది. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. సదరు ప్రొఫెసర్ క్లాస్‌రూమ్‌లో మైక్ పట్టుకుని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ విద్యార్థిని గతంలోనే తనపై ప్రేమను వ్యక్తపరిచిందని ఆయన అందరి ముందు క్లెయిమ్ చేశారు.

దీనిని తీవ్రంగా ఖండించిన ఆ విద్యార్థిని.. అందరి ముందే...