భారతదేశం, ఫిబ్రవరి 5 -- పల్నాడు జిల్లా అధికారులు కోటప్పకొండ ఆలయంలో జరగబోయే మహా శివరాత్రి వేడుకల కోసం భక్తులు సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ రైడ్‌లు, వీక్షణ కేంద్రాలు, బోటింగ్ సౌకర్యాలు, ఇతర సౌకర్యాలతో భక్తులను స్వాగతించడానికి సిద్ధమయ్యారు అధికారులు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోటప్పకొండ ఉత్సవాల నిర్వహణకు రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఉత్సవాల సమయంలో త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి ప్రసాదంగా ఒక లడ్డూను ఉచితంగా అందిస్తామని చెప్పారు. గత సంవత్సరాల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని దర్శన ఏర్పాట్లను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం వీఐపీ పాస్‌లకు బదులుగా వీఐపీ టిక్కెట్లను జారీ చేయాలని నిర్ణయించింది.

మహా శివరాత్రి సన్నాహకాలపై మూడో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి ఆనం...