భారతదేశం, మే 14 -- జంతువులకి సేవ చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. హిందూ ధర్మంలో జీవ కారుణ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూగజీవులకి ఆహారం పెట్టడం అనేది దైవ పూజతో సమానం. జంతువుల పట్ల ప్రేమ చూపించి వాటికి సేవ చేయడం వలన జాతకంలో దోషాలు తొలగిపోతాయి. అదృష్టం కూడా మన వెంట ఉంటుంది. ముఖ్యంగా బుధవారం నాడు ఈ పనులు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

బుధవారం బుధ గ్రహానికి చిహ్నం. మేధస్సు, వ్యాపారం, వాక్కు మొదలైన వాటికి కారకుడు బుధుడు. కాబట్టి బుధవారం నాడు ప్రత్యేక జంతువులకి పచ్చ గడ్డి లేదా పచ్చి కూరగాయలు వంటివి ఆహారంగా ఇవ్వడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఐశ్వర్యం కలుగుతుంది. మరి ఇక ఏ జంతువులకు ఆహారాన్ని పెట్టడం వలన కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గోమాతను మనం దైవంగా భావిస్తాము. ముక్కోటి దేవతలు గోమాతలో కొలువై ఉంటారని నమ్ముతాము. బుధవారం నాడ...