భారతదేశం, సెప్టెంబర్ 15 -- తెలంగాణలోని నిరుపేదలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఇతరులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. కొత్తగా ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం కల్పించిన సమయం నేటితో (సెప్టెంబర్ 15) ముగియనుంది. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

పింఛన్ల పెంపు, కొత్త లబ్ధిదారుల చేరికపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన లభించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.8 లక్షలకు పైగా మంది కొత్త పింఛన్ల కోసం అప్లై చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో ఏ ఒక్క నిజమైన లబ్ధిదారునికి అన్యాయం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం స్క్రూటినీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించింది.

వచ్చిన అర్జీలను పక్కాగా వడపోసేందుకు రె...