భారతదేశం, ఫిబ్రవరి 10 -- కొండాపూర్‌లో భారీ భూకబ్జాపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంది. సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించింది. జంగమోని కుంట ఆక్రమణలపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది హైడ్రా. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనగూడ మార్గం వరకు అధికారులు పరిశీలనలు చేపట్టారు.

సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జంగమోని కుంటను కబ్జాదారులు మట్టితో నింపి చదును చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయానికి సిద్ధం చేసినట్లు గుర్తించారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో రెవెన్యూ శాఖతో కలిసి హైడ్రా జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. ఈ ఘటనపై కబ్జాదారులపై కేసులు నమోదు చేసిన రెవెన్యూ అధికారులు, చెరువును పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. చెరువు పరిరక్షణలో భాగంగా హైడ్రా ఫెన్సింగ్ పనులు కూడా చేపట్టింది.

Published by HT Digital Co...