భారతదేశం, ఆగస్టు 14 -- ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భారీగా నిధులు పక్కదారి పట్టిన వ్యవహారంలో దేవాదాయ శాఖ అధికారులు తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఆలయ నిధుల దుర్వినియోగంపై సాగిన విచారణ అనంతరం మొత్తం నలుగురు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో ఒక ప్రధాన నిందితుడిని ఉద్యోగం నుంచి డిస్మిస్, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు సూపర్‌వైజరీ స్థాయి అధికారులకు వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేస్తూ జరిమానా విధించారు.

ఆలయ నిధుల మళ్లింపులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అసిస్టెంట్ కె. శ్రీనివాసాచారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఈవో ఎస్. అంజనా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసాచారి ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, మొత్తం 12 రకా...