భారతదేశం, సెప్టెంబర్ 17 -- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం సమైక్యత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

కేసీఆర్ ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మొన్నటివరకు కేసీఆర్ ఫామ్‌హౌస్ 1,000 ఎకరాలు ఉందంటూ ప్రచారం చేసిన రేవంత్, నిన్న మాత్రం 67 ఎకరాలు ఉందంటూ సరికొత్త మాటలు చెబుతున్నారు. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా 67 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. అఫిడవిట్‌లో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి కొత్తగా కనిపెట్టినట్లు మాట్ల...