భారతదేశం, ఏప్రిల్ 22 -- చలికాలం విరామం తర్వాత, శివ భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఈరోజు ఏప్రిల్ 22, 2026 బుధవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. మంచు పర్వతాల మధ్య కొలువైన ఈ పుణ్యక్షేత్రం భక్తుల రాకతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గతేడాది కంటే ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

నేడు ఉదయం సరిగ్గా 8 గంటలకు శుభ ముహూర్తంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా 'హర హర మహాదేవ', 'జై బాబా కేదార్' అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. ఈ విశేష సందర్భం కోసం కేదార్‌నాథ్ ఆల...