కేంద్రం కీలక నిర్ణయం.. పల్నాడు జిల్లాలో అరుదైన ఖనిజాల అన్వేషణకు ఆమోదం!
భారతదేశం, జూలై 23 -- భారతదేశ క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాల) వ్యూహంలో ఆంధ్రప్రదేశ్ ఒక కీలకమైన మైలురాయిని చేరుకుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో అరుదైన మృత్తికా మూలకాలు (Rare Earth Elements - REE), ఇతర సంబంధిత కీలక ఖనిజాల ఉనికిని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాలోని 12 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని ప్రత్యేకంగా రిజర్వ్ చేసింది.
ఈ రిజర్వ్ చేసిన బ్లాక్ పెట్లూరివారిపాలెం, కాకాని, అచ్చమ్మపాలెం గ్రామాల పరిధిలోకి వస్తుంది. అణు, వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణలో దేశంలోనే అగ్రగామి సంస్థ అయిన అణు ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని 'అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్' (AMD) కి ఈ భూభాగాన్ని కేటాయించారు.
ఈ ఐదేళ్ల అన్వేషణ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో అరుదైన మృత్తికా మూలకాలు, ఇతర సంబంధిత ఖనిజాల లభ్యత, వాటి నాణ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.