భారతదేశం, ఫిబ్రవరి 7 -- అండర్-19 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన యంగ్ టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ ను ఆరుసార్లు గెలుచుకున్న ఏకైక దేశం భారత్. శుక్రవారం (ఫిబ్రవరి 6) రాత్రి ఫైనల్లో ఇంగ్లాండ్ ను 100 రన్స్ తేడాతో ఓడించి యువ భారత్ విశ్వ విజేతగా నిలిచింది. కప్ దక్కించుకున్న యంగ్ టీమ్ పై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది.

అండర్-19 ప్రపంచకప్ 2026 టైటిల్ దక్కించుకున్న భారత యువ జట్టుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అదిరిపోయే న్యూస్ చెప్పింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి 2026 అండర్-19 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్న భారత అండర్-19 క్రికెట్ జట్టుకు రూ.7.5 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. 2026 అండర్-19 ప్రపంచ కప్‌ను అజేయంగా ముగించినందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా...