భారతదేశం, ఆగస్టు 14 -- శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ను ప్రకృతి విపత్తు తీవ్రంగా కలచివేసింది. కిష్త్వార్ జిల్లాలోని చొసిటి గ్రామం దగ్గర మాచెయిల్ మాత యాత్ర మార్గంలో తీవ్రమైన కుంభవృష్టితో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 37 మంది యాత్రికులు దుర్మరణం చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య జరిగిందని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ తెలిపారు. మాచెయిల్ మాత ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో చొసిటి అనేది చివరి వాహనాలు వెళ్లే ప్రాంతం. అక్కడి నుంచి 8.5 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లాలి. ఈ ఘటన జరిగినప్పుడు యాత్రలో పాల్గొనడానికి వందలాది మంది భక్తులు అక్కడే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.