భారతదేశం, జూలై 22 -- వెన్నుపాముకు ఇరువైపులా చిక్కుడు గింజ ఆకారంలో ఉండే కిడ్నీలు పరిమాణంలో చిన్నవిగా కనిపించినప్పటికీ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తాయి. ప్రతిరోజూ రక్తంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలు, విష పదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటును నియంత్రించడం, శరీరంలో ద్రవాలు-ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటం, ఎముకల ఆరోగ్యాన్ని పెంచడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన హార్మోన్లను విడుదల చేయడం వంటి పనులన్నీ కిడ్నీలే చూసుకుంటాయి.

మనదేశంలో కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటికేటా పెరుగుతోంది. భారతదేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో కిడ్నీ వ్యాధుల తీవ్రత 2011-2017 మధ్య కాలంలో 11.2 శాతంగా ఉండగా, 2018-2023 నాటికి అది 16.38 శాతానికి పెరిగినట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయ...