భారతదేశం, సెప్టెంబర్ 19 -- విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన గాదే సాయికృష్ణ కస్టోడియస్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న రియల్టర్ గులివిందల సురేష్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచిన సిట్.. శుక్రవారం కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పోలీసుల అమానుష చర్యలు, ఆధారాల విధ్వంసం, మృతదేహం దహనం వరకు జరిగిన వరుస పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించింది.

మే 7న కృష్ణలంక సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుల్ నానిలు సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో దారుణంగా కొట్టారని, ఆ సమయంలో రియల్టర్ సురేష్ అక్కడే ఉన్నాడని సిట్ పేర్కొంది. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన సాయికృష్ణను రాణిగారితోటలోని ఒక నిర్మానుష్య భవనానికి తరలించారు.

మే 12న సురేష్ ఆ భవనానికి వెళ్లగా సాయికృష్ణ...