భారతదేశం, ఫిబ్రవరి 14 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దాసును కిడ్నాప్ చేసింది జ్యోత్స్ననే అని పారిజాతంకు తెలిసిపోతుంది. నీ పని చెప్తానే సుమిత్ర కూతురా అని పారు అనుకుంటుంది. మరోవైపు దీప ఆలోచిస్తుంటే రెండో బిడ్డను పెంచేందుకు పెద్దగా ఆలోచించకు, కార్తీక్ బాబు ఇద్దరు బిడ్డలను బాగా చూసుకుంటాడని దీప మేనత్త అంటుంది.

మరోవైపు శౌర్య డ్రాయింగ్ వేసి చెల్లి పుడుతుందా, తమ్ముడు పుడతాడా అని అడుగుతుంది. ఏ డ్రెస్ వేయాలని అంటుంది. దీప కడుపు దగ్గరికి వెళ్లి దీప మాట్లాడటంతో అంతా కార్తీక్, దీప ఎమోషనల్ అవుతారు. గుడికి వెళ్లడం గురించి కాంచన చెబితే.. దీప వద్దంటుంది. తాను రానంటుంది. కాంచన కారణం అడిగితే చెప్పకుండా వెళ్లిపోతుంది దీప.

మీ ఇద్దరితో మాట్లాడాలిరా అని కాంచన అంటుంది. మరోవైపు దాసు ఎక్కడికి వెళ్లాడు అని జ్యోత్స్న కంగారుపడుతుంది. నా కొడుకునే కిడ్...