భారతదేశం, ఏప్రిల్ 5 -- కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) బిల్డింగ్‌ ప్లాన్స్‌తో సహా వివిధ లావాదేవీలపై వసూలు చేసే రుసుమును భారీగా పెంచింది. బిల్డింగ్ ప్లాన్స్ ధర మూడు రెట్లు పెరగగా, వాణిజ్య లైసెన్సుల ధర ఇప్పుడు రెట్టింపు అయ్యింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుంచి వివిధ లావాదేవీలపై పెంచిన రేట్లు అమల్లోకి వచ్చాయి. 2011 నుంచి వివిధ రుసుములు స్థిరంగా ఉన్నాయని.. ఈ ఛార్జీల పెంపు స్వల్పమేనని మరోవైపు అధికారులు చెబుతున్నారు.

ఈ పెంపు చాలా అన్యాయమని పన్ను చెల్లింపుదారులు ఆరోపణలు చేస్తున్నారు. ఒకేసారి ఛార్జీలను మూడు రెట్లు పెంచడం సరికాదని అంటున్నారు. 500 చదరపు మీటర్ల వరకు భవన ప్రణాళికల ఆమోదం కోసం ఆస్తి యజమాని ప్రతి చదరపు మీటరుకు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. 500 చదరపు మీటర్లు దాటితే ప్రతి 100 చదరపు మీటర్లకు రూ.300 చెల్లించాలి. ఆ...