భారతదేశం, మే 19 -- హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక ఘోర హత్య కలకలం రేపింది. కట్టుకున్న భార్యపై ఉన్న కోపంతో, ఆమె పనిచేస్తున్న చోటికే వెళ్లిన ఒక భర్త.. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అతి కిరాతకంగా చంపేశాడు. స్పా సెంటర్‌లోకి చొరబడి ఈ ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్‌పూర్‌ పరిధిలోని కిషన్‌బాగ్‌‌లో నివసిస్తున్న బంగి దేబోరా అనే మహిళ కవాడిగూడలోని ఒక ప్రముఖ స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. గత కొంతకాలంగా దేబోరా, ఆమె భర్త మధ్య కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. రోజూలాగే మంగళవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన దేబోరా, ఆ గొడవను పక్కనబెట్టి తన విధులకు హాజరయ్యేందుకు కవాడిగూడలోని స్పా సెంటర్‌కు వచ్చేసింది.

భార్య తనతో గొడవపడి వెళ్లడాన్ని తట్టుకోలేకపోయిన ...