భారతదేశం, జూలై 27 -- ఆటల్లో గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలి. కానీ అలా కాకుండా. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడో వ్యక్తి. బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో తన జట్టు ఓడిపోయిందన్న నిరాశతో. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఏకంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపింది.

కర్నూలు నగరంలోని స్థానిక బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా గత నాలుగు వారాలుగా 'కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్' (KBPL) పోటీలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో 'అనన్య' ఫ్రాంచైజీ జట్టు ఓటమి పాలైంది. ఈ జట్టులో కౌశిక్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సభ్యుడిగా ఉన్నాడు.

మ్యాచ్ ...