భారతదేశం, జనవరి 26 -- దిల్లీలోని కర్తవ్య పథ్‌లో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్​ మద్దతు ఉన్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన భారీ సైనిక చర్య 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంతో రూపొందించిన త్రివిధ దళాల శకటం హైలైట్​గా నిలిచింది. ఇ శకటం దేశ సైనిక పటిమను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

రిపబ్లిక్​ డే పరేడ్​లో భాగంగా భారత సైన్యం, నావికాదళం, వాయుసేనల ఏకీకృత పోరాట పటిమను ప్రతిబింబిస్తూ 'విక్టరీ త్రూ జాయింట్‌నెస్' అనే ఇతివృత్తంతో ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. యుద్ధ సమయంలో వ్యూహాత్మక ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు, దళాల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో ఈ శకటం కళ్లకు కట్టింది.

ముఖ్యంగా ఆపరేషన్​ సిందూర్​లోని నిర్ణయాత్మక సైనిక పోరాటంలో వాయుసేన జరిపిన ఖచ్చితమైన దాడులు, సముద్ర రంగంలో నౌకాదళం చూపిన త...