భారతదేశం, జూన్ 3 -- కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్‌లో సాయంత్రం 4.05 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తొలి విడతగా సుమారు 13 మంది మంత్రులు కూడా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. మే 30న కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శివకుమార్.. ఇకపై రాష్ట్ర పగ్గాలను అధికారికంగా చేపట్టనున్నారు.

మంత్రివర్గ తుది జాబితాను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా ఈ కసరత్తులో నిమగ్నమయ్యారు. మంగళవారం రా...