భారతదేశం, ఏప్రిల్ 2 -- విద్యుత్ షాక్ కారణంగా సంభవించే మరణాలకు ఇచ్చే పరిహారాన్ని విద్యుత్ నియంత్రణ కమిషన్(ఈఆర్‌సీ) రూ. 5 లక్షల నుండి రూ. 8 లక్షలకు పెంచింది. సవరించిన ఈ పరిహారం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. వినియోగదారుడి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిన సందర్భాలలో కూడా ఇది వర్తిస్తుంది. సంఘటన జరిగిన రెండు నెలల్లోగా నష్టపరిహారం చెల్లించేలా చూడాలని విద్యుత్ పంపిణీ సంస్థలను(డిస్కామ్‌లను) ఈఆర్‌సి ఆదేశించింది. ఉత్తర్వులలో పేర్కొన్న ప్రకారం, ఆలస్యం జరిగితే డిస్కామ్‌లు ఆ లోపానికి సరైన కారణాలను తప్పనిసరిగా తెలియజేయాలి.

2026-27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్‌లలో ఎలాంటి మార్పు ఉండదని కమిషన్ ప్రకటించింది. దీనితో పాటు, వినియోగదారుల సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో అనేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆర్థిక విషయాలకు సంబంధించి 2022-23, 2023-24 సంవ...