భారతదేశం, ఫిబ్రవరి 15 -- మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కానీ స్పష్టమైన మెజారిటీ రాని మున్సిపాలిటీల్లో సమీకరణాలు గంట గంటకు మారుతున్నాయి. ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై అందరి చూపు ఉంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఇక్కడ అవతరించింది. కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. దీంతో అధికార కాంగ్రెస్.. ఎట్టిపరిస్థితిల్లోనూ తగ్గేది లేదని డిసైడ్ అయింది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ పావులు కదుపుతున్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసేందుకు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఉత్కంఠభరితంగా మారింది. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటి నెలకొంది.

మొత్తం 66 డివిజన్లలో అత్యధికంగా 30 డివిజన్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ మే...