భారతదేశం, ఫిబ్రవరి 16 -- కరీంనగర్ మేయర్ పీఠంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండగా.. కార్పొరేట్లను తరలించేందుకు ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక్కడ క్షణం క్షణం సమీకరణాలు మారిపోతున్నాయి.

కరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కానీ మేయర్ సీటు కైవసం చేసుకుంటామని బీజేపీ ప్రకటించింది. స్వతంత్రుల మద్దతును కూడా కూడగట్టింది. హైదరాబాద్ లో క్యాంపును కూడా ఏర్పాటు చేసింది. ముందుగా కాస్త సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్. చివర్లో ట్విస్ట్ ఇచ్చింది. తాము కూడా మేయర్ రేసులో ఉన్నామని ప్రకటించింది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతుందనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

కరీంనగర్ సిటీలో మొత్తం 66 డివిజన్...