భారతదేశం, జూలై 19 -- Committee Kurrollu National Award Other Awards And OTT: శ‌నివారం (జూలై 18) రోజున భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 72వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ నిర్మాత‌గా మారి రూపొందించిన తొలి తెలుగు చిత్రం 'క‌మిటీ కుర్రోళ్లు' రెండు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది.

తెలుగులో జాతీయ ఉత్త‌మ చిత్రంగా నిల‌వ‌టంతో పాటు మేక‌ప్ కేట‌గిరిలో (పి.ర‌వికుమార్‌) ఈ సినిమా అవార్డును ద‌క్కించుకుంది. ఇది వ‌ర‌కే అంటే 2024లో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక పురోగతిని ప్రతిబింబించే కేట‌గిరిలో ఉత్త‌మ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది.

కమిటీ కుర్రోళ్లు ద‌ర్శ‌కుడు య‌దు వంశీ సైతం ఉత్త‌మ డెబ్యూ డైరెక్ట‌ర్‌గా అవార్డును అందుకున్నారు...