భారతదేశం, మే 11 -- Kadapa Junction Renaming Clash : కడప నగరంలో ట్రాఫిక్ జంక్షన్ నామకరణం వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అల్మాస్‌పేట సర్కిల్ వద్ద శనివారం రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరకు రాళ్ల దాడికి.. పోలీసులపై దాడులకు దారితీసింది. ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీస్ యంత్రాంగం నిందితులను ఏరివేసే పనిలో పడింది. ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంది.

స్థానిక అల్మాస్‌పేట జంక్షన్‌కు ఒక వర్గం టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేయగా, మరో వర్గం హనుమాన్ జంక్షన్‌గా నామకరణం చేయాలని పట్టుబట్టింది. ఈ రెండు వర్గాల మధ్య వాగ్వివాదం కాస్తా ముదిరి పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలను అదుపు చేసే క్రమంలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెల్లాచెదు...