భారతదేశం, జూన్ 2 -- తెలంగాణపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ అహంకారంతో, ఆధిపత్య ధోరణితో మాట్లాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'కచ్చితంగా ఇది మా అయ్యా జాగీరే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అయ్యా జాగీరే. కానీ నీ అయ్యా జాగీరు మాత్రం కాదు.' అంటూ పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

'తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణాలు అర్పిస్తుంటే ఎప్పుడైనా సంఘీభావం తెలిపావా? ధైర్యంగా పోరాడమని చెప్పావా? తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినకుండా ఏడ్చిన వ్యక్తివి.. ఇప్పుడు వచ్చి ప్రేమ ఒలకబోస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.' అని పొన్నం ఆగ్రహం వ్యక్తం ...