భారతదేశం, జూలై 30 -- భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో హైదరాబాద్‌కే చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ చారిత్రాత్మక ఘనత సాధించింది. దేశీయ రోడ్లపై ఏకంగా 4,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ కంపెనీగా నిలిచింది.

హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (HRTC) ఫ్లీట్‌లో నూతనంగా చేరిన 297 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ విశిష్ట మైలురాయిని వేడుకగా నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముకేష్ అగ్నిహోత్రిలకు ఒలెక్ట్రా తమ 4,000వ ఎలక్ట్రిక్ బస్సును అధికారికంగా అందించింది.

"భారత రోడ్లపై 4,000 ఎలక్ట్రిక్ బస్సులను దించిన తొలి సంస్థగా నిలవడం ఒలెక్ట్రా సాధించిన విజయం మాత్రమే కాదు; ఇది భారత ఎలక్ట్రిక్ రవాణా రంగానికే ఒక దిశా నిర్దేశం. పర్యావరణ హిత ప్రజారవాణాపై దేశవ్యాప్తంగా ఆర్టీసీ...