భారతదేశం, మార్చి 2 -- పశ్చిమాసియా దాడులు, ప్రతీకార దాడులతో అట్టుడుకుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ డ్రోన్ దాడులతో అనేక ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.

ఒమన్‌లో ఇరాన్ డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఒమన్ గల్ఫ్‌లో ఒక ఇరాన్ డ్రోన్ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి చేసింది. ఆ నౌకను MKD VYOMగా గుర్తించారు. హార్ముజ్ జలసంధిని సమీపిస్తున్న ఓడలను ఇరాన్ బెదిరిస్తోంది. ఒమన్ గల్ఫ్‌లో జరిగిన దాడిని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఒమన్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. చనిపోయిన సిబ్బంది భారతదేశానికి చెందినవారని తెలిపింది.

వార్తా సంస్థ రాయిటర్స్ MKD VYOMను ఒక డ్రోన్ ఢీకొట్టిందని తెలిపింది. ఆ ప్రమాదంలో ఓడ ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తుండగా అంద...