భారతదేశం, ఆగస్టు 3 -- ఎన్నికల వ్యూహకర్తగా సుపరిచితుడైన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రంలోనే తన సత్తా చాటారు. బిహార్‌లోని బీజేపీ బలమైన కోటగా పేరుగాంచిన బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఆయన ఘనవిజయాన్ని నమోదు చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన తుది గణాంకాల ప్రకారం ప్రశాంత్ కిశోర్ మొత్తంగా 64,151 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయాన్ని అందుకున్నారు. 2025 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచేందుకు తీవ్రంగా శ్రమించిన జన్ సురాజ్ పార్టీకి బిహార్ శాసనసభలో ఇది తొలి ప్రాతినిధ్యం కావడం గమనార్హం.

"నా ఎమ్మెల్యే గెలుపుతో బాంకీపూర్ రాత్రికి రాత్రే బెంగళూరుగా మారిపోదు. కానీ, రాబోయే రెండు మూడు నెలల్లో ఇక్కడ స్పష్టమైన మార్పులను చూస్...