భారతదేశం, ఆగస్టు 16 -- ఒకే ఒక్క జూమ్ కాల్ ద్వారా ఏకంగా 900 మందికి పైగా ఉద్యోగులను తొలగించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండియన్-అమెరికన్ పారిశ్రామికవేత్త విశాల్ గార్గ్.. తన ఉద్యోగాన్ని కోల్పోయారు! 'బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్' సంస్థ.. గార్గ్​ని సీఈఓ పదవి నుంచి తప్పించింది. అయితే, ఆయన ఇప్పుడు తన ఉద్యోగం కోసం పట్టుబడుతున్నారు.

తన స్థానంలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన డేనియల్ లూయిస్ తనను మోసం చేశారని గార్గ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

"అతను నన్ను నమ్మించి మోసం చేశాడు. కంపెనీ వ్యూహాలు చాలా బాగుందని ప్రశంసిస్తూ అందరిని మంచి చేసుకున్నాడు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మమ్మల్ని పొగిడి, బోర్డులోకి వచ్చి మా విశ్వాసాన్ని పొందాడు," అని సీఎన్‌ఎన్‌తో మాట్లాడిన సందర్భంగా విశాల్ గార్గ్ పేర్కొన్నారు.

జులై 27న బోర్డులో చేరిన డేనియల్ లూయిస్‌ను.. కేవలం వారంలోన...