భారతదేశం, సెప్టెంబర్ 1 -- భారతీయ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగాలోకి దిగింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్), 'బాంబే క్రీమరీ' (Bombay Creamery) పేరుతో తన కొత్త ప్రీమియం ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను దేశీయ మార్కెట్‌లో ఆవిష్కరించింది.

బాంబే క్రీమరీని ఒక అందుబాటు ధరలోని ప్రీమియం డైరీ బ్రాండ్‌గా ఆర్‌సీపీఎల్ నిలుపుతోంది. కృత్రిమ పదార్థాలకు దూరంగా, కేవలం స్వచ్ఛమైన పాల క్రీమ్ (Real Dairy Cream)తోనే ఈ ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారులకు గ్లోబల్ క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను సరసమైన ధరలకే అందించాలనే సంకల్పంతో ఈ అడుగు వేసింది.

ఈ బ్రాండ్ కింద కోన్స్ (...