భారతదేశం, ఆగస్టు 15 -- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ పరిధిలో రాబోయే కొన్ని రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 14 నుండి 17 వరకు కోస్తాంధ్ర, యానాంలలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది.

అంతేకాకుండా ఆగస్టు 18 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. జిల్లా స్థాయి హెచ్చరికల ప్రకారం, మొదటి నాలుగు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో, జిల్లా, రోజును బట్టి గంటకు 30 నుండి 50 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా...