భారతదేశం, మార్చి 10 -- తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ సహా పలు ప్రొఫెషనల్ కాలేజీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్యూషన్ ఫీజు తప్ప ఇతర పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఇటీవలే ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కాలేజీల ఫీజును ఖరారు చేసిన విషయం తెలిసిందే.

గతంలో కాలేజీలు స్పెషల్ ఫీజు పేరుతో రూ.8,500 వరకు వసూలు చేసేవి. కొన్ని కాలేజీలు అనధికారికంగా రూ.12,000 నుంచి రూ.16,000 వరకు కూడా తీసుకుంటుండేవి. ఇప్పుడు ఆ అదనపు ఫీజులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేట్ కాలేజీలు ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ.8,500 స్పెషల్ ఫీజు రద్దు చేసింది. అడ్మిషన్, ల్యాబ్, లైబ్రరీ పేర్లతో అదనపు ఫీజులకు నో చెప్పింది. ఏవేవో పేర్లు చెప్పి ఫీజులను వసూలు...