భారతదేశం, మార్చి 26 -- రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్, ఎన్ఐసీ అధికారుల‌తో భూభారతి పోర్టల్ తుది దశకు చేరుకున్నందున సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గత ప్రభుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతూ, రైతులకు అత్యంత పార‌ద‌ర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా భూభారతి పోర్టల్‌ని రూపొందించామన్నారు.

నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండ‌లాల్లో ఏప్రిల్ 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.

పైల‌ట్ మండ‌లాల్లో మెరిట్-డీమెరిట్‌ల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి వాటికి అవ‌స...