భారతదేశం, మే 26 -- ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు కొందరు దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.

వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఇవి అని ప్రభుత్వం ఆరోపించింది. మెగా డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకమైన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో, అత్యున్నత స్థాయి డిజిటల్ భద్రతా ప్రమాణాలతో నిర్వహించామని తెలిపింది. మల్టీ-సెషన్ పద్ధతిలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించిన ఈ పరీక్షలలో ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వడం సాంకేతికంగా అసాధ్యమని స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు...