భారతదేశం, మే 31 -- ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. భారత రైల్వే రంగంలో అత్యంత కీలకమైన 18వ రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జూన్ 1, 2026 (సోమవారం) నుండి పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మే 4, 2026న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ఈ కొత్త జోన్ అధికారికంగా రూపుదిద్దుకుంది.

విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా (హెడ్‌క్వార్టర్స్) పనిచేయనున్న ఈ కొత్త రైల్వే జోన్ విస్తరణ, పాలనాపరమైన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిపాలనా యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. ఈ కొత్త జోన్‌కు మొదటి జనరల్ మేనేజర్‌గా సందీప్ మాథుర్ బాధ్యతలు చేపట్టారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రైల్వే లైన్ల సామర్థ్యం పెంపు, మూడో, నాలుగో ట్రాక్ లైన్ల అభివృద్ధి వంటి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన స్...