భారతదేశం, సెప్టెంబర్ 6 -- ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ చెందిన స్వదేశ్ దర్శన్ 2.0 , ప్రసాద్ పథకాల కింద రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపొందించిన రూ.419.30 కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ నిధులతో చేపట్టే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అతిత్వరలోనే టెండర్లను పిలవనుంది.

గతంలోనే స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ.152 కోట్ల వ్యయంతో అరకు బొర్రా గుహలు, సూర్యలంక బీచ్‌ల అభివృద్ధిని చేపట్టడంతో పాటు నాగార్జునసాగర్ వద్ద బుద్ధిస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అల్లురి సీతారామరాజు జిల్లా అరకులోయలోని కొత్తవలస ప్రాంతంలో ఐటీడీఏకి చెందిన 19.23 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు ...