భారతదేశం, అక్టోబర్ 1 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండగా... తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. రిజిస్ట్రేషన్ల గడువును అక్టోబర్ 3 వరకు పొడిగించారు. వెబ్ ఆప్షన్ల నమోదుకు కూడా అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించారు. ఈ మేరకు అధికారులు కొత్త తేదీలను ప్రకటించారు.

తాజా వివరాల ప్రకారం... ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 4వ తేదీ వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల గడువు అక్టోబర్ 6వ తేదీతో పూర్తవుతుంది. అక్టోబర్ 7వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా అక్టోబర్ 10వ తేదీన సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు అక్టోబర్ 11వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తి చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్త...