భారతదేశం, జూన్ 28 -- ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలలో బార్లు, మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఈ నూతన విధానం నుండి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి విమానాశ్రయానికి మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్-II) ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా 'జీవో ఎంఎస్ నెం. 386' విడుదల చేశారు.

విమానాశ్రయ ప్రాంగణంలో బార్ లేదా మద్యం దుకాణం ఏర్పాటు చేయాలనుకునే దరఖాస్తుదారులను సంబంధిత ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది.

బార్ లైసెన్స్ కోసం ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ సిఫార్సు చేసిన అభ్యర్థులు రూ. 5 లక్షల నాన్-రిఫండబుల్ (తిరిగి ఇవ్వబడని) ఫీజుతో పాటు 'ఫామ్-1B' లో సంబంధిత ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. విచారణ అనంతరం జిల్లా ఎక్సైజ్ అధికారి 'ఫామ్...