Andhrapradesh, సెప్టెంబర్ 20 -- ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. తాజాగా ఈఏపీసెట్ మూడో విడత సీట్లను అధికారులు కేటాయించారు. ఈ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు. ఈనెల 23లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

మరోవైపు ఈరోజు నుంచి ఇంజినీరింగ్ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఏపీ ఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....